Sunday, December 26, 2010

వంట చేస్తానోచ్


ఇప్పటి వరకు ఆహార పదార్ధాలను చల్లగా ఉంచే ఫ్రిజ్ ఇకపై తానే వంట చేస్తానంటోంది. వింతగా ఉన్న ఇది నిజామేనండి బాబూ. ఇది నీ మాటో, నా మాటో కాదు. లండన్ శాస్త్రవేత్తలు చెబుతున్న నిజం. ఫ్రిట్జ్ ఆఫ్ ప్యూచర్ అని పేరు కూడా పెట్టారు. త్వరలో వినియోగదారులు అందుబాటులోకి తెస్తామని కూడా చెబుతున్నారు. అసలు ఇది ఎలా పని చేస్తుందో తెలుసా... ఇది అరల్లో ఉన్న సరుకులను స్కానింగ్ ద్వారా గుర్తిస్తుంది. మనం కోరిన వంటకు అవసరమైన సరుకులు లేకపొతే సూపర్ మార్కెట్టుకు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటుంది. అంతేకాదు వంట చేయడానికి కొంత సమయం పడుతుంది అని కూడా చెబుతుంది. ఈ అధ్బుతమైన ఫ్రిట్జ్ నానో టెక్నాలజీతో తయారవుతోంది.

Saturday, December 25, 2010

వెండే బంగారం


ఈ ఆంగ్ల సంవత్సరంలో స్టాక్ మార్కెట్, బంగారం, వెండిలలో ఏది అత్యుత్తమ లాభాలు అందించిందో తెలుసా వెండి. అవును నిజమే వెండే బంగారమైంది. మదుపరులకు లాభాల పంట పండించింది. పెట్టిన పెట్టుబడిపై అరవైఐదు శాతం లాభాలు ఇచ్చింది. అదే సమయంలో బంగారం ఇరవైరెండున్నర శాతం, స్టాక్ మార్కెట్ పద్నాలుగున్నర శాతం ప్రటిఫలం ఇచ్చాయి. జనవరి ఒకటిన ఇరవైఏడు వేల నాలుగొందలు ఉన్న వెండి ధర డిసెంబర్ ఇరవైనాలుగో తేదీకి నలబై ఐదు వేల నాలుగొందలకు చేరింది. అదే కాలంలో బంగారం ధర పదహారువేల ఆరొందల డెబ్భై రూపాయలనుంచి ఇరవై వేల నాలుగొందల అరవై రూపాయలకు చేరింది. మొత్తంగా చుస్తే వెండి, బంగారంలో పెట్టుబడి బంగారు బాతు అని నిరూపించింది.

ఇక తెలంగాణా లొల్లి


వరదలు వచ్చాయి. జనాలను ముంచాయి. పంటలను నీటిపాలు చేసాయి. రైతులకు కన్నీళ్ళే మిగిల్చాయి. అండగా ఉంటామన్న సర్కారు సహాయ ప్యాకేజీలో రిక్త హస్తం చూపింది. శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షాల పోరాటం పాలకుల మేడలు వంచలేక పోయింది. రైతుకు న్యాయం చెయ్యాలంటూ చెంద్రబాబు ఆమరణ దీక్ష చేపట్టారు. తెలుగు తమ్ముళ్ళు రోడ్డెక్కారు. జాతీయ నాయకులూ రాష్ట్రానికోచ్చారు. అయినా సర్కారు దిగిరాలేదు. చివరకు బాబు ఏమీ సాదిన్చ్కుండానే దీక్ష విరమించారు. అప్పటికే డిసెంబర్ చివరికొచ్చింది. అంతే మళ్ళీ లొల్లి మొదలైంది. అదే తెలంగాణా లొల్లి. ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచే గడువు దగ్గర పడింది కాబట్టి. అందుకే పదహారో తెదేఎ గర్జన సభతో కదం తొక్కిన నేతలు ఇప్పుడు మాటలు పదును పెడుతున్నారు. కేసీఆర్ అయితే ప్రాణాలు అర్పించి అయినా ప్రేత్యక రాష్ట్రం సాధిస్తమంటున్నాడు. కొత్త సంవత్సరంలో ప్రేత్యేక యుద్దానికి కార్యకర్తలను, ప్రజలను సిద్దం చేస్తున్నారు. అదే సమయంలో ఎంపీ కావూరి సాంబశివరావు తెలంగాణకు, శ్రీకృష్ణ కమిటీకి వ్యతిరేకంగా గళం విప్పారు. వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు. తెలంగాణా కాంగ్రెస్ నేతలూ ప్రేత్యేక వాదానికి సై అంటున్నారు. కావురిపై నిప్పులు చెరుగుతున్నారు. కేసీఆర్ను బలపరచాలని, తెలంగాణా నేతలందరూ ఒకే గొడుగు కిందకు చేరదామని పెలుపు ఇస్తున్నారు. ఉద్యోగ సంఘాలు సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఇటు తెలంగాణా, అటు సీమాంధ్ర ప్రజలు మాత్రం శ్రీకృష్ణ కమిటీ నేవిదిక ఏమి చేబుతుందోనని ఆందోళనగా ఎదురు చూస్తున్నారు.

Athadu Brahmanandam Telugu Comedy.MPG

ఆ నోటు చెల్లుతుంది

ఇప్పుడు ఎక్కడా ఐదు రూపాయల నోటు ఇచ్చినా తీసుకోవడం లేదు. అదేమని అడిగితె చెల్లడం లేదని చెబుతున్నారు. ఇదంతా అబద్దమని తేలిపోయింది. కొత్త ఐదు నోట్లను త్వరలో ముద్రించాలని రిజర్వ్ బ్యాంకు నిర్ణయించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐదు రూపాయల నోట్ల కొరత ఉంది. ఎక్కువగా నాణాలే కనిపిస్తున్నాయి. నోట్లను విరివిగా చలామణిలోకి తెస్తే నాణాలతో ఏర్పడిన ఆసౌకర్యం కొంతవరకు తీరుతుందని రిజర్వ్ బ్యాంకు భావిస్తోంది.