Saturday, March 5, 2011
ప్రణబ్జీ నిజమేనా
మేము సమస్యలను సృష్టించగలము , పరిష్కరించగలము అంటూ ఎంత బాగా చెప్పారు ప్రణబ్జీ. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రేగిన చిచ్చు మీరు సృష్టించిన సమస్యే కదా. నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలే పరిష్కరించలేని సమస్యను రాత్రికి రాత్రే ఎలా పరిష్కరించగాలమని మీరు ఎంపీలను ప్రశ్నించారు. నిజమే కానీ ప్రస్తుత సమస్యను వాళ్ళు సృష్టించలేదు. మీరే సృష్టించారు. అదీ మీరు సాద్యం కాదంటున్న అదే అర్ధరాత్రి. తలగన ఏర్పాటు ప్రక్రియను ప్రరంభిస్తున్నామంటూ చిదంబరంతో ప్రకటన చేయించి మరీ సృష్టించారు. ఆ సమస్య ఇప్పుడు మా జీవితాల్లో కల్లోలం సృష్టిస్తోంది. అందుకే మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు సృష్టించిన తెలంగాణా సమస్యకు మీరు వెంటనే పరిష్కారం చూపండి. అప్పడు మీ మాటలు నిజమని నమ్ముతాం.
రాష్ట్రము కంటే పదవులే ముద్దా
పదవులు త్యజిస్తామన్న తెలంగాణా ఎంపీల , ఎమ్మెల్యేల మాటలు కాకమ్మ కబుర్లేనా... శాసన సభ , పార్లమెంట్ సమావేశాలు త్వరగా అయిపోతే బాగుండునని వాళ్ళు కోరుకుంటున్నారా ... అందుకే అడిస్తానంపై ఒత్తిడి , చేర్చల పేరుతొ కాలం వెళ్ళబుచ్చుతున్నారా ... అంటే అవుననే అనిపిస్తోంది . వాళ్ళ మాటలు , చేతలు అందుకు అద్దం పడుతున్నాయి . ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే తెలంగాణా మీద ప్రకటన వెలువడుతుందని ఎంపీలే చెబుతుండడం , శుక్రవారం చేసిన ప్రకటనకు భిన్నంగా తాజాగా 12va తేదీ అధిష్టానాన్ని కలిసి రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తామని చెప్పడం , ఆ తర్వాత భవిష్యత్తు కార్యాచరణను ప్రక్తిస్తామనడం చూస్తుంటే వాళ్ళు పదవులు వదులుకోవడానికి సిద్దంగా లేరని స్పష్టమౌతోంది.
Subscribe to:
Posts (Atom)