Friday, February 18, 2011
అసలు దోషులు ఎవరు
మళ్ళీ నిప్పు రాజుకుంది. తెలంగాణా ఆకాంక్ష ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. తెలంగాణా జేఏసీ గాంధీ మార్గమంటూ సహాయ నిరాకరణకు పిలుపునిచ్చింది. టిఆర్ఎస్ నేతలు టికెట్లు తీసుకోకుండా బసులు ఎక్కారు. శాసన సభలో అయితే ఇంకో అడుగు ముందు కేసారు. గాంధేయ మార్గాన్ని పక్కన పెట్టారు. ఆ పార్టీ శాసన సబ్యులు. అసెంబ్లీలో గవర్నెర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తెలుగుదేశం తెలంగాణా నెతలూ వాళ్లతో కలిసిపోయారు. తెలంగాణా సాధనే లక్ష్యంగా వీరంగం సృష్టించారు. శాసనసభ సమావేశాన్ని అడ్డుకున్నారు. వాళ్ళు వ్యవహరించిన తీరు బాధాకరమని మీడియా పాయింట్ వద్ద జేపీ కామెంట్ చేసారు. దానితో ఆగ్రహించిన టీఆర్ ఎస్ ఎమెల్యేలు ఆయనపై చేయి చేసుకున్నారు. ఆతర్వాత జరిగిన పరిణామాలతో ఉద్యమం వేడెక్కింది. మరోసారి ఉస్మానియా భగ్గుమంది. విద్యార్దులు రోడ్డెక్కారు. విద్వంసం సృష్టించారు. తెలంగాణాలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటె ఇన్ని అనర్ధాలకు అసలు కారకులు ఎవరు. నిజమిన దోషులేవారు. గత డిసెంబర్లో చిదంబరం చేసిన ప్రకటన నుంచి కేంద్రం వెనకడుగు వెయ్యడమే ఇందుకు కారణం. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచిన తర్వాత కూడా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా మీనా మేషాలు లెక్కిస్తున హస్తిన సర్కారే ఈ అనర్ధాలకు మూలం. తెలంగాణా ఇచ్చినా, తెచ్చినా మేమేనని చెప్పిన, చెబుతున్న ప్రతి కాంగ్రెస్ నేతా తెలంగాణా ప్రజా కోర్టులోని బోనులో దోషులే... వీరిలో ప్రధమ ముద్దాయి మాత్రం మేడం సోనియానే.
Thursday, February 17, 2011
Subscribe to:
Posts (Atom)